August 28, 2022
షారుక్ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జవాన్’. ఈ సినిమాలో విజయ్సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రజెంట్ చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. విజయ్, షారుక్లపై కీలక సన్నివేశాల ను చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి విజయ్ సేతుపతి భారీ పారితోషికాన్ని తీసుకుంటున్నారట. ‘జవాన్’ సినిమాకు విజయ్ సేతుపతి ఏకంగా 21 కోట్ల రూపాయాలను రెమ్యూనరేషన్ గా విజయ్ సేతుపతి చార్జ్ చేస్తున్నట్లుగా కోలీవుడ్, బాలీవుడ్ ఏరియాస్లో టాక్ వినిపిస్తోంది.
కమల్హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’ సినిమాలో విజయ్సేతుపతి విలన్గా నటించిన సంగతి తెలి సిందే. ఈ చిత్రం సూపర్హిట్గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ‘విక్రమ్’ సినిమా 400 కోట్ల రూపాయాలను వసూలు చేసింది. ఈ సినిమాకు విజయ్సేతుపతి దాదాపు 15 కోట్ల రూయాలను రెమ్యూనరేషన్గా తీసుకున్నారట. ‘విక్రమ్’ సినిమా సూపర్హిట్ కావడంతో అమాంతం రేటు పెంచేశారు విజయ్సేతుపతి. ఇప్పుడు 21 కోట్ల రూపాయాలను చార్జ్ చేశారట విజయ్సేతుపతి. జవాన్ చిత్రం వచ్చే ఏడాది జూన్లోవిడుదల కానుంది.