Project K : ప్ర‌భాస్ క‌ల నిజ‌మైంది

February 19, 2022

Project K : ప్ర‌భాస్ క‌ల నిజ‌మైంది
క‌ల నిజ‌మైంద‌నుటున్నారు ప్ర‌భాస్‌. ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో భాగంగా ఈ చిత్రంలో ఓ లీడ్ రోల్ చేస్తోన్న అమితాబ్‌ బ‌చ్చ‌న్‌తో క‌లిసి ప్ర‌భాస్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 18న వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లోని తొలి షాట్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది.
ఈ విష‌యంపై అమితాబ్ బ‌చ్చ‌న్ స్పందిస్తూ – బాహుబ‌లి ప్ర‌భాస్‌తో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షాట్ పూర్త‌యింది. ప్రభాస్ ప్ర‌తిభ‌, హుందాత‌నం ప్రేమ‌తో నిండిపోయి ఉన్నాయి. ఇంకా తెలుసుకోవాల్సి ఉంది“అని ట్వీట్ చేశారు.
అమితాబ్‌బ‌చ్చ‌న్‌గారితో క‌లిసి న‌టించాల‌న్న నా క‌ల నిజ‌మైంది. Project K షూటింగ్‌లో భాగంగా అమితాబ్‌బ‌చ్చ‌న్‌గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు సంతోషంగా ఉంది“ అని పేర్కొన్నారు ప్ర‌భాస్‌.
 
ఇక ప్రాజెక్ట్ కె విష‌యానికి వ‌స్తే…నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న Project K చిత్రంలో ప్ర‌భాస్‌, అమితాబ్‌బ‌చ్చ‌న్‌, దీపికాప‌దుకొనె ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు.
ఈ సినిమా తాజా షెడ్యూల్‌ హైద‌రాబాద్‌లో మొద‌లైంది. రెండు రోజుల క్రితం మొద‌లైన ఈ సినిమా షూటింగ్ మ‌రో 10 రోజుల‌ పాటు జ‌రుగుతుంద‌ని తెలిసింది.
ప్రాజెక్ట్ కె చిత్రాన్ని వ‌చ్చే ఏడాది మేలో విడుద‌ల చేస్తామ‌ని ఈ చిత్రం నిర్మాత అశ్వ‌నీద‌త్ చెప్పిన విష‌యం గుర్తుండే ఉంటుంది.
Read More: Grey Movie: న‌ల‌భై ఏళ్ల త‌ర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో..

ట్రెండింగ్ వార్తలు