OTT REVIEW: ఓదెల రైల్వేస్టేష‌న్

August 26, 2022

OTT REVIEW: ఓదెల రైల్వేస్టేష‌న్

  • Cast : , ,
  • Director :
  • Producer :
  • Banner :
  • Music :

/ 5

చిత్రం: ఓదెల రైల్వేస్టేష‌న్‌ తారాగణం: హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ, గగన్ విహారి, నాగ మహేష్, సురేందర్ రెడ్డి, హారిక, ప్రవణ్య రెడ్డి, దివ్య, నవీన్, క్రియేటర్ – సంపత్ నంది నిర్మాత – కెకె రాధా మోహన్ దర్శకత్వం – అశోక్ తేజ డీవోపీ – సౌందర్ రాజన్. ఎస్ ఎడిటర్ – తమ్మి రాజు సంగీతం – అనూప్ రూబెన్స్

థియేట‌ర్స్‌లో పెద్దసినిమాలు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంటే ఓటీటీలో చిన్న సినిమాలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అందుతో భాగంగా సంప‌త్‌నంది క‌థ‌,మాట‌లు, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో 2002లో తెలంగాణ‌లోని ఓదెల అనే గ్రామంలో జ‌రిగిని వ‌రుస హ‌త్య‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఓదెల రైల్వే స్టేష‌న్ ఆగ‌స్ట్ 26న ఆహాలో విడుద‌లైంది. మ‌రి ఈ సినిమా థ్రిల్ల‌ర్ మూవీ ల‌వ‌ర్స్‌కి ఎంత‌వ‌ర‌కు న‌చ్చింది అనేది ఇప్పుడు చూద్దాం…

క‌థ‌: అనుదీప్ (సాయి రోనక్) సివిల్స్ లో టాపర్. ఐఎఎస్ ఆప్షన్ ని వదులుకొని ఐపీఎస్ ని ఎంచుకుంటాడు. ట్రైనింగ్ లో భాగంగా ఓదెల అనే గ్రామానికి వస్తాడు. అదే గ్రామంలో రాధ (హెబ్బా పటేల్) భర్త తిరుపతి (వశిష్ట సింహ) ఇస్త్రీ చేసుకొని జీవితం గడపుతుంటారు. వీరి వివాహం జరిగి చాలా కాలం గడిచినా పిల్లలు కలగరు. తిరుపతికి వున్న లైంగిక సమస్యపై డాక్టర్ ని కూడా సంప్రదిస్తుంది రాధ. ఇదే సమయంలో ఓదెలలో ఒక సంచలనమైన కేసు వెలుగు చూస్తుంది. శోభనం జరిగిన మరుసటి రోజే పెళ్లి కూతుర్ల‌ని ఒక సైకో అతి కితారకంగా అత్యాచారం చేసి చంపేస్తుంటాడు. వరుసగా హత్యలు జరుగుతాయి. ఈ కేసు అనుదీప్ కి ఒక సవాల్ గా మారుతుంది. మరి ఈ కేసుని అనుదీప్ ఎలా చేధించాడు ? పచ్చటి పల్లెటూరిలో ఇంత దారుణమైన సైకో హత్యలు చేస్తున్న కిల్లర్ ఎవరు ? అసలు శోభనం మరుసటి రోజే అమ్మాయిలని ఎందుకు చంపుతున్నాడు ? అనేది మిగతా కథ.

విశ్లేష‌ణ‌: ద‌ర్శ‌కుడిగా బెంగాల్ టైగ‌ర్‌, ర‌చ్చ, సీటీమార్ వంటి చిత్రాలు తెర‌కెక్కించాడు సంప‌త్ నంది. ఆయన ఇచ్చిన కథలతో కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఈ సారి వాటికి భిన్నంగా తొలిసారి ఒక క్రైమ్ థ్రిల్లర్ ని అందించాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అశోక్‌ తేజ్ కథని సంచలనంగా మొదలుపెట్టాడు. ఒక మహిళ ఒకరి తల నరికి ఆ త‌ల‌తో పోలీసు స్టేషన్ లో లొంగిపోతుంది. అ మహిళా ఎవరనేది స్పష్టంగా చుపించలేదు. ఆ మహిళ ఎవరు ? తల ఎవరిదనే క్యురీయాసిటీ ప్రేక్షకుడిలో కలుగుతుంది. మొదటి హత్య జరిగిన తర్వాత సైకో ఎవరని ప్రేక్షకుడు అలోచించడం మొదలుపెడతాడు. ఈ దశలో కొన్ని పాత్రల అనుమానం వచ్చేలా నడిపిన సీన్లు పాతగానే వున్నా.. అసలు సైకో కిల్లర్ ఎవరనే ఎగ్జ‌యిట్మెంట్ మాత్రం కలిగించారు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ కూతురు హత్య జరుగుతుందో.. అప్పుడే సినిమా క్లైమాక్స్ కి వచ్చేసినట్లనిపిస్తుంది. అయితే అసలు సైకో ఇంకా దొరకలేదని వచ్చే ట్విస్ట్ .. దాని వెనుకున్న డ్రామా ఆక‌ట్టుకుంటుంది. ఇలాంటి సినిమాల్లో సైకో ఆడే మైండ్ గేమ్ కూడా చాలా ముఖ్యం. కానీ ఇందులో అలాంటి గేమ్ ఏమీ కనిపించదు. సైకోకి పెద్ద తెలివితేటలేమీ ఉండ‌క‌పోవ‌డం ఈ సినిమాకు పెద్ద మైన‌స్‌. ఇక ఇందులో పోలీసుల విచారణ చూస్తే..ఎంత పల్లెటూరైన మరీ ఇంత తేలికగా విచారణ చేస్తారా ? అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలకి అసలు సైకో రివిల్ అయినపుడు ప్రేక్షకుడు పొందే థ్రిల్ చాలా ముఖ్యం. ఇందులో మాత్రం ఆ థ్రిల్ మిస్ అయ్యింది. సైకో కిల్లింగ్ కి అతడు ఇచ్చుకున్న కారణం కూడా అసహజంగా వుంటుంది. ఎప్పుడైతే రాధకి సైకో కిల్లర్ గురించి ఒక లీడ్ దొరికిందో అప్పుడే ముగింపు అర్ధమైపోతుంది. ఈ కథకు బయలాజికల్ జస్టిఫీకేషన్ ఇవ్వాలని ఒక లైంగిక రుగ్మతని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు. అయితే సైకో కిల్లర్ కథని ఆ పాయింట్ అంతగా సమర్ధించదు.

న‌టీన‌టుల పెర్‌ఫామెన్స్ విష‌యానికి వ‌స్తే హెభా ప‌టేల్ తొలిసారి డీగ్లామర్ రోల్ లో కనిపించింది. ఉన్నంత‌లో బాగానే చేసింది. క్లైమాక్స్ లో మాత్రం హెభా నటన ఆకట్టుకుంటుంది. నార‌ప్ప‌తో ప‌రిచ‌యం అయిన వశిష్ట సింహ తన పాత్రకి న్యాయం చేశాడు. ట్రైనీ ఐపీఎస్ గా సాయి రోనక్ పాత్ర ఆకట్టుకుంటుంది. ప్రెసిడెంట్, హెబ్బ మరిది, వూర్లో ఫోటోగ్రఫీ చేసిన పాత్రలలో కనిపించే నటులు పరిధిమేర నటించారు. పరిమిత బడ్జెట్ లో తీసిన సినిమా ఇది. అయితే అనూప్ రూబెన్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌందర్ రాజన్ డీవోపీ సినిమాకి ప్లస్ అయ్యాయి. నిడివి తక్కువ ఉండ‌డం కూడా ఒక ప్లస్ పాయింట్. ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా వుందని చివర్లో హింట్ ఇచ్చారు. అయితే ఈ కథలో సైకో దొరికాడు. కేసు క్లోజ్ అయ్యింది. పార్ట్ 2 అంటే మరో సైకో కిల్లర్ కథని చూపించాలి. సినిమా ఓటీటీలో వుంది కాబట్టి సమయం కుదిరినప్పుడు ఒకసారి చూడొచ్చు.

ట్రెండింగ్ వార్తలు