‘రౌద్రం…రణం…రుధిరం’ సినిమా వాయిదా పడకపోయి ఉన్నట్లయితే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ పడి ఉండేవి. కానీ ఈ సినిమా రిలీజ్ ఆగిపోగింది. అయితే ఈ సినిమాలోని ఇంట్రవెల్ సీన్ను 85 రోజులు తీశారు. అంటే రోజు మొత్తం కాదు. 85 రాత్రలు తీశారు. ప్రతి రాత్రికి దాదాపు 75 లక్షలు ఖర్చు అయ్యేది. మరి..రాజమౌళి దాదాపుగా 65 కోట్లు ఖర్చు చేసి ఇన్ని రోజులు తీసిన ఈ ఇంట్రవెల్ సీన్ వెండితెరపై ఎలా కనిపిస్తుందో చూడాలి. ఇక ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకూలిస్తే ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి