ప్ర‌స్తుతం తెలుగుక‌థ‌లు ఎక్కువగా వింటున్నా – మేఘా ఆకాశ్‌

August 13, 2021

ప్ర‌స్తుతం తెలుగుక‌థ‌లు ఎక్కువగా వింటున్నా – మేఘా ఆకాశ్‌

లాక్‌డౌన్‌లో ‘రాజరాజ చోర’ క‌థ‌ను విన్నాను. చాలా డిఫ‌రెంట్‌గా అనిపించి ఈ సినిమాలో సంజ‌న అనే పాత్ర చేశాను అని అంటోంది మేఘా ఆకాశ్..శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. హితేశ్ గోలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఆగస్ట్ 19న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మేఘా ఆకాశ్ చెప్పిన విశేషాలు..

ఇప్పుడున్న ప‌రిస్థితులు ప్రేక్ష‌కులు ఎంట‌ర్‌టైనింగ్ సినిమాలు చూడాల‌నుకుంటున్నారు. ‘రాజరాజ చోర’ క‌చ్చితంగా అలాంటి సినిమానే..

భాష‌ను బేస్ చేసుకుని స్క్రిప్ట్స్ ఎప్పుడూ ఒప్పుకోను. మంచి స్క్రిప్ట్ కోసమే చూస్తాను. అందుకే ఏదీ ఒప్పుకోలేదు. ఇప్పుడు తెలుగులో చాలా మంచి స్క్రిప్ట్స్ వ‌చ్చాయి. డిఫ‌రెంట్ సినిమాలు చేయాల‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. క‌థ‌లు ఎక్కువ‌గా వింటున్నాను.

శ్రీవిష్ణు కొత్త వాళ్ల‌తో అంత త్వ‌ర‌గా క‌లిసిపోడు.. సిగ్గ‌రి. నేను కూడా కొత్త‌వాళ్ల‌తో అంత ఈజీగా క‌లిసిపోను. అయితే నా కంటే త‌ను చాలా సైలెంట్‌గా ఉంటాడు. కాబ‌ట్టి నేను ఎక్కువగా మాట్లాడుతూ త‌న‌తో క‌లిసిపోయే ప్రయ‌త్నం చేశాను. కానీ ఓసారి శ్రీవిష్ణు ఎదుటి వ్య‌క్తుల‌తో క‌లిసిపోయిన త‌ర్వాత‌, చాలా ఫ‌న్నీగా మాట్లాడుతుంటాడు.

ప్ర‌స్తుతం తెలుగులో డియ‌ర్ మేఘ‌, గుర్తుందా శీతాకాలం, మ‌నుచ‌రిత్ర‌, మ‌రో సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది. త‌మిళ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని చెప్పుకొచ్చింది.