September 21, 2021
ఉప్పెన సినిమాతో యూత్లో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అందాల భామ కృతిశెట్టి, ఫాలోయింగ్ తో పాటు వరుస అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లో నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది కృతిశెట్టి. ఆమె పుట్టినరోజు సెప్టెంబరు21. ఈ సందర్భంగా ఆమెకు సంబందించిన అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్.
(1). ‘శ్యామ్ సింగ రాయ్’
నాని జోడీగా కృతి శెట్టి నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను వదిలారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమా, సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. దీపావళికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు.
(2). #RAPO19
రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. రామ్కి ఇది 19వ చిత్రం. ఈ సినిమాలో రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది.
తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి కృతిశెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పోస్టర్ లో ఈ బ్యూటీ చాలా క్యూట్ గా కనిపిస్తోంది. ఇటీవలే ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా కొనసాగుతోంది.
(3). ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’
ఇక కృతి శెట్టి నటిస్తున్న మరో సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. ఇటీవలే శ్రీదేవి సోడా సెంటర్ తో వచ్చిన సుధీర్ బాబు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. నేడు కృతి శెట్టి పుట్టినరోజు సందర్బంగా చిత్రయూనిట్ బర్త్ డే విషెస్ తెలియజేసింది.
(4). మాచర్ల నియోజకవర్గం
ప్రస్తుతం మాస్ట్రోతో మంచి హిట్ కొట్టిన యూత్ స్టార్ నితిన్ తోను కృతిశెట్టి ఓ సినిమా చేయనుంది. ‘మాచర్ల నియోజకవర్గం’ అనే టైటిల్ తో ఇటీవలే పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రస్తుతం స్క్రిప్టు పనులను చేసుకుంటున్న చిత్రబృందం త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రాన్ని నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్లో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.