గోవాలో షూటింగ్ జ‌రుపుకుంటోన్న‌ ‘స‌ర్కారువారి పాట‌’.

August 13, 2021

గోవాలో షూటింగ్ జ‌రుపుకుంటోన్న‌ ‘స‌ర్కారువారి పాట‌’.

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు లేటెస్ట్ మూవీ ‘స‌ర్కారువారి పాట‌’. ఈ చిత్రం నుంచి స్పెష‌ల్ డే..మ‌హేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌లైన బ్లాస్టర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ బ్లాస్టర్ లో మ‌హేశ్ చాలా స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. త‌న యాట్యిట్యూడ్‌, డైలాగ్ డెలివ‌రీ, కామెడీ టైమింగ్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉన్నాయి.

రీసెంట్‌గా ‘స‌ర్కారువారి పాట‌’ హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్త‌య్యింది. శుక్ర‌వారం నుంచి గోవాలో కొత్త షెడ్యూల్ ప్రారంభ‌మైంది. ఓ భారీ సెట్ వేసి ఫైట్ మాస్ట‌ర్స్‌ రామ్ ల‌క్ష్మ‌ణ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్ర‌క‌రిస్తున్నారు. దీంతో పాటు కొంత టాకీ పార్టును కూడా చిత్రీక‌రిస్తారు.

స‌ర్కారువారి పాట‌ను మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఆర్‌.మ‌ది సినిమాటోగ్రాఫ‌ర్‌. 2022 సంక్రాంతి స్పెష‌ల్‌గా జ‌న‌వ‌రి 13న సినిమాను విడుద‌లచేయ‌నున్న విష‌యం తెలిసిందే..